Petrol: దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ , డీజిల్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో ప్రజలు షాక్ తింటున్నారు. కొన్ని పైసల రూపంలోనే పెరుగుతూ పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీని దాటేశాయి. ఇంకొన్ని చోట్ల వందకు చేరువలో ఉన్నాయి. మొత్తంగా ఈ ధరలతో ప్రజలు షాక్ తింటుంటే…కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రజల బీపీ పెంచేశాలా ఉన్నాయని అంటున్నారు.
Read More: Corona: షాక్ః కరోనా టీకా డోసుల మధ్య గ్యాప్ ప్రమాదకరమట…
ఇవేం మాటలండి కేంద్రమంత్రి గారు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రజలకు సమస్యాత్మకం అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ఈ పెంపు వల్ల వచ్చిన డబ్బులను ప్రజలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాల అమల కోసం ఆదా చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత పెట్రో ధరలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. “ ఈ ఏడాది వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం మేం డబ్బులను కాపాడుతున్నాం“ అని సూచించారు.
Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైదరాబాద్లో కరోనా టీకా
ఎన్ని చేస్తున్నామో తెలుసా?
అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు. “పేద ప్రజలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎనిమిది నెలల పాటు ఆహార ధాన్యాలు అందించేందుకు మోడీ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలను వేశాం. ఇటీవల కనీస మద్దతు ధరనూ పెంచాం. ఇవన్నీ ఒకే సంవత్సరంలో చేశామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కాగా, ధరల పెంపు విషయంలో ప్రజలు ఓ వైపు షాక్ తింటుంటే కేంద్రం మాత్రం ఇలా కొత్త సూత్రాలు చెప్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.