Prashant Kishore: ప్రశాంత్ కిశోర్… ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్, మమతా బెనర్జీల గెలుపులో కీలక భూమిక పోషించారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట అని బ్రాండ్ ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ భారీగా తగ్గుతున్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇంకేమి వ్యూహాలు రచిస్తున్నాడోనని బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అదే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ గూటికి చేరడం!.
Read More: Modi: తండ్రి కాంగ్రెస్… కొడుకు బీజేపీ… మోడీ వల్లే ఇద్దరు కలిసి సృష్టించిన రికార్డు ఇది
ఢిల్లీలో పీకే సంచలనం…
ఢిల్లీ టూర్లో ఉన్న ప్రశాంత్ కిశోర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టిన ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో నిజంగానే ఎన్నికల్లో బీజేపీకి పీకే షాక్ ఖాయమా అనే టాక్ వినిపిస్తోంది.
Read more : BJP: తగ్గేది లేదంటున్న బీజేపీ..ఇరు రాష్ట్రాల సీఎంలపై …
ఇటీవలే ముంబై టూర్లో …
ప్రశాంత్ కిషోర్ ముంబై పర్యటన కమల నాథుల గుండెల్లో గుబులు పుట్టించింది. ముంబైలో ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ ను కలిసిన ప్రశాంత్ కిషోర్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కూడా మీట్ అవ్వటం రాజకీయాల్లో కలకలం రేపింది. దీనికి కొనసాగింపుగా తాజాగా ఆయన ఢిల్లీ టూర్ సాగుతుండటం కాషాయ పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తాను ఇక వ్యూహకర్త పదవి నుంచి తప్పుకోనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో వస్తారా అని ప్రశ్నించగా.. తానో విఫల నేతనని చెప్పారు. గతంలో పీకే.. నితీష్ కుమార్కు చెందిన జేడీయూలో చేరిన విషయం తెలిసిందే. మరిప్పుడు కాంగ్రెస్ ప్రచారంపై ఆయన ఎలా స్పందిస్తారో!