ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రదాని మోడీ అశ్రునయనాలతో ఇంటి వద్ద నుండి వ్యాన్ వరకూ తల్లి పాడెను మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్ధివ దేహం వద్ద కూర్చుని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. గాంధీనగర్ లోని ముక్తిథామ్ శ్మశానవాటికలో అంతిమ సంస్కాారాలను నరేంద్ర మోడీ సహ సోదరులు నిర్వహించారు. అనంతరం మోడీ స్మశానవాటిక నుండి వెనుతిరిగారు. హీరాబెన్ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యుల తో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గాంధీనగర్ లోని నివాసంలో తన తల్లి భౌతికకాాయానికి పుష్పాంజలి ఘటించి కడసారి నివాళులర్పించారు.
హీరాబెన్ అస్వస్తతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలియడంతో ప్రధాని మోడీ వెంటనే గుజరాత్ కు చేరుకున్నారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భావోద్వేగంతో సందేశాన్ని రాసుకొచ్చారు. హీరాబెన్ ఇటీవలే వందవ పుట్టిన రోజు జరుపుకున్నారు. తల్లి జన్మదిన వేడుకలకు హజరైన మోడీ.. ఆ తర్వాత గుజరాత్ ఎన్నికల పోలింగ్ రోజున తల్లి వద్దకు చేరుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.
కాగా పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించేందుకు ప్రధాని మోడీ ఇవేళ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా వర్చువల్ పద్దతిలో ఆ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని అధికారవర్గాల అందుతున్న సమాచారం.
ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల పలువురు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ, కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు, ముఖ్య మంత్రులు సంతాపం తెలిపారు. ట్విట్టర్ వేదికగా వారు తమ సంతాప సందేశాలను తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్ను మూత