G20 Summit: ఇండోనేషియా బాలిలో జరుగుతున్న 17వ జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ (సోమవారం) బయలుదేరారు. ఆాహరం, ఇంధన భద్రత – ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ఈ సమావేశాల్లో వర్కింగ్ సెషన్స్ జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుండి మూడు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రెండవ ప్రయత్నంలో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్ పిన్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సహా పది దేశాల అధినేతల పాల్గొంటుండగా వారితో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ సమావేశాలకు హజరు కావడం లేదని సమాచారం.
జీ 20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్ పర్మేషన్ అండ్ హెల్త్ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధాన మంత్రి మోడీ పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా పేర్కొన్నారు.వివిధ కీలక అంశాలపై మోడీతో పాటు ఇతర దేశాల నేతలతో చర్చించనున్నారు. దీంతో పాటు ప్రధాని మోడీ పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తొంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే..వచ్చే ఏడాది జీ – 20 సమ్మిట్ ఇండియాలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడి నుండి భారత ప్రధాని మోడీ లాంఛన ప్రాయంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. డిసెంబర్ 1 నుండి జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనున్నది. 2023 సెప్టెంబర్ లో జీ 20 సమావేశాలకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. కాగా ఈ సదస్సు అనంతరం ప్రదాన మంత్రి మోడీ అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరుకానున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?