CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ ఎంపిక ప్రక్రియకు కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి మోడీ నివాసంలో నిన్నరాత్రి ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయ్యంది. ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అథిర్ రంజన్ చౌధురి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సీబీఐ కొత్త డైరెక్టర్ పదవికి 1984 -87 బ్యాచ్ లకు చెందిన 109 మందికి అధికారుల పేర్లను ఈ ఉన్నత స్థాయి కమిటీ పరిగణలోకి తీసుకొంది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి ప్యానల్ సమావేశంలో ముగ్గురు అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్ అవస్తీ, ఎస్ఎస్బీ డీజీ కేఆర్ చంద్ర, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) వీఎస్కే కౌముది పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ అంశంపై చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని అధిర్ రంజన్ ఛౌదురి ఎంపిక తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Read more: MP RRR Case: రఘురామ కేసులో కొత్త ట్విస్ట్లు ఇవీ..!!
ఈ పదవికి ఎంపికైన అధికారి రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ గా కొనసాగుతారు. ఇంతకు ముందు సీబీఐ డైరెక్టర్ గా పూర్తి కాలం పని చేసిన ఆర్కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిటైర్ అయ్యారు. నాలుగు నెలలకు ముందుగానే ఈ కమిటీ సమావేశమై సీబీఐ కొత్త చీఫ్ ను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఆ శాఖలో సీనియర్ అధికారి, సంయుక్త డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సీనియారిటీతో పాటు అవినీతి కేసులో విచారణ అనుభవం, నిజాయితీ, నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.