Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 75 నగరాలలో నేడు యోగా వేడుకలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ఫర్ హ్యూమానిటీ అన్న నినాదంతో ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఇళ్లు, అథ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచ నలుమూలలా విస్తరించిందని అన్నారు మోడీ.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Yoga Day: యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి
యోగ అత్మ విశ్వాసం కల్పిస్తుందని, జీవన విశ్వాసం ఇస్తుందని పేర్కొన్నారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదనీ, అందరిదని అన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. భారత ప్రత్యేకతను, వైవిద్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో యోగా శాంతి నెలకొల్పుతుందనీ, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని, యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 15 వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కాగా దేశ వ్యాప్తంగా జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొన్నారు.
ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో జరిగిన యోగా కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఉత్తరప్రదేశ్ నోయిడాలో, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రుషికేష్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. యోగా అంటే సాధన చేయడం, ఏకాగ్రత సాధించడం అని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. యోగా భారతీయ సంస్కృతికి ప్రతికీ అని, కులమతాలకు అతీతమైనదని అన్నారు.