PM Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా టీకామొదటి డోసును తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకా రెండవ దశ పంపిణీ సోమవారం నుండి ప్రారంభించారు. వ్యాక్సినేషన్ రెండవ దశలో భాగంగా నేటి నుండి వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ మొదలైన నేపథ్యంలో మోడీ మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నట్లు మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కరోనా కట్టడిలో మన వైద్యుల కృషి మరువలేనిదని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. కరోనా రహిత భారతదేశం కోసం మన మంతా కృషి చేయాలని మోడీ పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని మోడీ సూచించారు.