దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్ చేరుకున్నారు. ఆక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని మోడీ మిఠాయిలు పంచిపెట్టారు.అనంతరం మోడీ మాట్లాడుతూ.. సైనికులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జవాన్ల త్యాగం మరువలేనిదని అన్నారు. ఎంతో కాలంగా సైనికులు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఉగ్రవాద ముగింపే దీపావళి పండుగ అని, దాన్ని కార్గిల్ సాధ్యం చేసిందన్నారు పీఎం మోడీ. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయని కొనియాడారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుండి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మోడీ.
ప్రధాని మోడీ సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఇది ప్రధమం కాదు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. అప్పటి నుండి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దులో విదులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. గత ఏడాది జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో సైనికులతో కలిసి మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్గిల్ లో సైనికుల వద్ద వేడుకలు జరుపుకున్నారు. ఈ సారి కార్గిల్ లో సైనికుల వద్ద వేడుకలు జరుపుకున్నారు. వందేమాతం, భారత్ మాతకీ జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. జవాన్లు ఉపయోగించే రైఫిల్స్ ను పరిశీలించారు మోడీ.
అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం .. పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
PM Modi