ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురై 2001 లో గుజరాత్ లో సంభంవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు.
మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ టర్కీ, సిరియాలలో భుకంపాల వల్ల జరిగిన విధ్వంసం గురించి ప్రధాన మంత్రి మోడీ తమకు సమావేశంలో వివరించారని చెప్పారు. ఈ సందర్భంలో మోడీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లపర్యంతం అయ్యారని తెలిపారు. 2001 లో గుజరాత్ లో సంభవించిన భూకంపాన్ని, ఆనాటి విధ్వంసాన్ని, ప్రజల కష్టాలను ఆయన గుర్తు చేసుకున్నారన్నారు. గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ కారణంగా టర్కీ ప్రజల కష్టాలను మోడీ అర్ధం చేసుకోగలరని అన్నారు.
టర్కీ, సిరియాలను సోమ, మంగళవారం వరుస భుకంపాలు కుదిపేశాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సహాయాన్ని పంపిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్, మందులు, పరికరాలు వంటి వాటిని పంపించింది. ఈ సహాయం ఇవేళ టర్కీకి చేరుకోనున్నది.
YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?