corona: దేశంలో కరోనా వ్యాప్తి కలకలం కొనసాగుతోంది. తాజాగా జరిగిన స్వాత్రంత్య ప్రసంగంలో కూడా రాష్ట్రపతి ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా.. 36,083 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరో 493 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది.
Read More: Corona: కరోనా డెల్టా ప్లస్ మరణాలు మొదలు… బీ కేర్ ఫుల్
రాష్ట్రపతి ఏమంటున్నారంటే…
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గినా.. ఇంకా పూర్తిగా పోలేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరోనా కట్టడి కోసం పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్లకు అభినందనలు తెలియాజేశారు. వారి సేవల కారణంగాణే కరోనా సెంకడ్ వేవ్ను అదుపు చేశామన్నారు. కరోనాపై సంపూర్ణ విజయం సాధించేందుకు ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో విజయవంతం కావడంవల్లే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగలిగామన్నారు. కరోనా నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లే రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా రాష్ట్ర పతి స్పష్టం చేశారు.
Read More:corona: కరోనా థర్డ్ వేవ్ కలకలం.. ఆ పని చేసిన కేంద్రం….
దేశంలో ఇది పరిస్థితి…
దేశంలో రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 3,85,336(1.20శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 37,927 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 73,50,553 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇచ్చినవారి సంఖ్య 54,38,46,290కి చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెప్పింది.