Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, వైసీపీ తరపున ఎంపీ విజయసాయిరెడ్డి పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని ముందుగా ప్రధాన మంత్రి మోడీ ప్రతిపాదించారు. నామినేషన్ పత్రాలపై మోడీతో సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపి నడ్డా సంతకాలు చేశారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని మహత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, మిస్రా ముండా విగ్రహాల వద్ద ద్రౌపది ముర్ము నివాళులర్పించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఈ నెల 27వ తేదీన నామినేషన్ వేయనున్న సంగతి తెలిసిందే. ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని బీజూ జనతాదళ్ (బీజేడీ) , వైసీపీ సైతం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ పక్షాలకు తోడుగా బీజేడీ, వైసీపీ మద్దతుగా నిలవడంతో ద్రౌపది ముర్ము విజయం లాంఛన ప్రాయమే అన్నది అందరికీ తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ లో మొత్తం 10,86.431 ఓట్లకు గానూ ఎన్ డీ ఏ కి 5,32,351 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన ఓట్లు 45,550, బీజేడీకి చెందిన 31,686 ఓట్లతో పాటు అన్నా డీఎంకే కు చెందిన 14,940 ఓట్లు ముర్ముకే పడనున్నాయి. ముర్ము రాష్ట్రపతి స్థానాన్ని అలంకరించే తొలి గిరిజన మహిళయే కాక చిన్న వయస్సులోనే (64) రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించనున్నారు.