Presidential Polls: రాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను దాదాపు ఖరారు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గతంలో బీజేపీలో కీలక నాయకుడుగా ఉన్న యశ్వంత్ సిన్హా 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరారు. టీఎంసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న యశ్వంత్ సిన్హా నేడు ఆ పదవికి రాజీనామా చేయడంతో ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్దిగా ఖరారు చేశారు అన్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరో పక్క అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎస్టీ మహిళ అయిన చత్తీస్ఘడ్ రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికీ పేరు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలు ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరు దాదాపు 50 నిమిషాల సేపు వెంకయ్యతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ సాయంత్రం భేటీ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది.
ఈ తరుణంలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపి నడ్డా లు వెంకయ్యనాయుడుతో భేటీ కావడంతో వెంకయ్యనాయుడుని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు బీజేపీ అగ్రనేతల భేటీ కోసమే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తొంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?