దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా కేంద్రంలో బీజేపీ రెండు సార్లు అధికారంలోకి రావడం, బీజేపీ వ్యహాలు, ఎత్తుగడలతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో అధికారం చేరువలోకి వచ్చినా బీజేపీ వ్యూహాలతో చేజార్చుకుంటోంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఇటీవల ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా భారత్ జోడో యాత్రను దేశ వ్యాప్త ఉద్యమంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా గురువారం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పదాధికారుల సమావేశంలో భారత్ జోడో యాత్ర విధి విధానాలపై నేతలు చర్చించారు. అనంతరం భారత్ జోడో యాత్ర వివరాలను సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ లు మీడియాకు వివరించారు.
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 2న ప్రారంభం అవుతుందని దిగ్విజయ్ సింగ్, జై రామ్ రమేష్ లు తెలిపారు. ఈ యాత్ర 148 రోజుల పాటు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 3500 కిలో మీటర్ల మేర జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి రోజు 25 కిలో మీటర్ల పాదయాత్ర కొినసాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగుతుందని తెలిపారు.
గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ సంస్థలను వ్యక్తులపై ఉసి గొల్పడం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అయితే రాష్ట్రాల పీసీసీల సన్నద్దత తర్వాత యాత్ర ఎక్కడ నుండి ప్రారంభం అవుతుందనే దానిపై ప్రకటన చేస్తామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి పీసీసీల రాష్ట్ర నాయకులు చేపట్టిన యాత్రలు కూడా ఇందులోకి చేరుతాయని పేర్కొన్నారు.
మాల్దీవుల నుండి పేకాఫ్ .. సింగపూర్ మీదుగా సౌదీకి గొటబాయ