Rahul Gandhi: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సీనియర్ నేతలు రాహుల్ ను కొసాగాలని ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా అన్నారు. దీంతో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. శనివారం జరిగిన సీడబ్ల్యుసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ మరో సారి బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ బలంగా వ్యక్తం అయ్యింది. ఏఐసీసీ సీనియర్ నాయకులు సైతం రాహుల్ నాయకత్వానికి మద్దతు పలికారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పేరును అశోక్ గెహ్లాట్ ప్రతిపాదించగా ఇతర నేతలు సానుకూలంగా స్పందించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ..సీడబ్ల్యుసీ మీటింగ్ నేతల ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను మరో సారి చేపట్టే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాననీ అయితే పార్టీ సైద్ధాంతిక భావజాలంపై సీనియర్ల నుండి స్పష్టత రావాల్సి ఉందనీ, నేతలు తమ నిర్ణయాలను వెల్లడించాలని తెలిపినట్లు సమాచారం.
Rahul Gandhi: ఏఐసీసీ సంస్థాగత ఎన్నికల షెడ్యుల్ కు సీడబ్ల్యుసీ ఆమోదం
ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే వరకూ రాహుల్..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని పలువురు సీనియర్ లు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అధ్యక్షోపన్యాసంలో సోనియా గాంధీ పార్టీకి తానే పూర్తి స్థాయి అధ్యక్షురాలిననీ, తాత్కాలిక అధ్యక్షురాలిగా చూడవద్దని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా సీడబ్ల్యుసీ సమావేశం అనంతరం వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వెల్లడించారు. ఏఐసీసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 20 20 మధ్య జరుగుతుందని వెల్లడించారు. సంస్థాగత ఎన్నికల షెడ్యుల్ కు సిడబ్ల్యుసీ ఆమోదం తెలిపింది. నవంబర్ 1వ తేదీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. 2022 ఏప్రిల్ లో అధ్య పదవికి నామినేషన్లు స్వీరించనున్నారు.
2022 అక్టోబర్ 21 కొత్త అధ్యక్షుడి ఎన్నిక
2022 ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 21 వరకూ సీడబ్ల్యుసీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది, 2022 అక్టోబర్ 21 నాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పార్టీల కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ భారీ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై కార్యకర్తలు, నేతలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో రైతులపై జరుగుతున్న దాడులు, వ్యవసాయ రంగం దుస్థితి, రాజకీయ పరిస్థితులకు వ్యతిరేకంగా తీర్మానాలను సిడబ్ల్యూసీ ఆమోదించింది.