Rahul Gandhi: కశ్మీర్ లో ఓ బ్యాంకు మేనేజర్ మృతి చెందడంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ బీజేపీ అధికారానికి నిచ్చెనలా మారిందని విమర్శించారు రాహుల్ గాంధీ. కశ్మీర్ ను కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్ల లో బిజీగా ఉన్నారని రాహుల్ సెటైర్ వేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Rahul Gandhi: కశ్మీర్ లో శాంతి పునరుద్దరణకు తక్షణం చర్యలు తీసుకోవాలి
బ్యాంక్ మేనేజర్, ఉపాధ్యాయుడు ఇలా ఎంతో మంది అమాయకులు ప్రతి రోజు బలి అవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ పండిట్లు పారిపోతున్నారన్నారు. వారిని కాపాడాల్సిన వారు సినిమా ప్రమోషన్ల కే సమయం సరిపోకుండా ఉన్నారన్నారు. కేవలం కశ్మీర్ బీజేపీ అదికారం ఎక్కడానికే ఉపయోగపడే నిచ్చెనలా మారిపోయిందని విమర్శించారు. కశ్మీర్ లో శాంతి పునరుద్దరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి మోడీకి విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
बैंक मैनेजर, टीचर और कई मासूम लोग रोज़ मारे जा रहे हैं, कश्मीरी पंडित पलायन कर रहे हैं।
जिनको इनकी सुरक्षा करनी है, उनको फिल्म के प्रमोशन से फुर्सत नहीं है। भाजपा ने कश्मीर को सिर्फ अपनी सत्ता की सीढ़ी बनाया है।
कश्मीर में अमन कायम करने के लिए तुरंत कदम उठाइए, प्रधानमंत्री जी। pic.twitter.com/cWaHH8pONh
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022