Road Accident: గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం పాలైయ్యారు. ఆనంద్ జిల్లా తారాపుర్ సమీపంలో జాతీయ రహదారిపై కారు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తారాపుర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
Gujarat: 10 members of a family, including a child, died in a collision between a car and a truck near Tarapur in Anand district earlier this morning. Police personnel are present at the spot, bodies referred to Tarapur Referral hospital. Police investigation is underway.
— ANI (@ANI) June 16, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?