RS Praveen Kumar: తెలంగాణ గురుకులాల సత్తాను కొత్త పుంతలు తొక్కించి హఠాత్తుగా వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో సంచలన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాల వైపు అడుగులు వేయడం ఖాయమన్న ప్రచారం జరగడం, టీఆర్ఎస్లో చేరనున్నారు… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. బీఎస్పీలో చేరి తెలంగాణలో ఆ పార్టీ బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారనే చర్చసాగింది. తాజాగా ఆ వార్తలు నిజమేనని ఖరారైంది. సాక్షాత్తు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
Read More : BJP: దూసుకువస్తున్న మాయావతి.. యూపీలో బీజేపీకి బీపీ?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడే చెప్పేశారు
ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉండగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. “ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాను. అనేక శాఖల్లో పని చేశాను. అయితే, నా సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించాను. వందశాతం పేదల పక్షాల ఉండాలనే రాజీనామా చేస్తున్నారు.“ అని ప్రకటించారు. అయితే, ఆయన ఆర్ఎస్పీ, బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని ఆ పార్టీలలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది.
Read More : Owaisi : మోడీకి షాకిచ్చేందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనున్న ఓవైసీ?
మాయావతి క్లారిటీ
తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కాన్షీరాం అడుగుజాడల్లో నడిచేందుకు బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని ప్రకటించారు. దీంతో బీఎస్పీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు గ్నీన్ సిగ్నల్ వచ్చినట్టు అయ్యింది. ఇదిలాఉండగా, గత నెలలో ఆయన యూపీకి వెళ్లి బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటికే జై భీమ్, జై భారత్ నినాదంతో ఉన్న ఆయన పలు సందర్భాల్లో బహుజనవాదం కూడా వినిపించారు. ఆగస్టు 8న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీలో చేరనున్నట్లు సమాచారం.