NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల బాహాబాహీ .. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏమైందంటే…?

సుప్రీం కోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్ రసాభాసాగా మారింది. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే సమయంలో సభ్యులు తమ సెల్ ఫోన్ లను తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నామని మేయర్ షెల్లీ ఒబెరాయ్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ కౌన్సిలర్ లు వ్యతిరేకించారు. మేయర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెల్ లోకి వచ్చి బీజేపీ కౌన్సిలర్ లు నినాదాలు చేశారు. మేయర్ నిర్ణయానికి మద్దతుగా ఆప్ కౌన్సిలర్లు నినాదాలు చేయడంతో సదన్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో సభ్యుల మధ్య తోపులాట జరిగింది. సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు, పేపర్లు, చేతికి దొరికిన ప్రతి వస్తువును విసురుకున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ స్టాండింగ్ కమిటీ ఓటింగ్ ప్రక్రియను పలు మార్లు వాయిదా వేశారు. రాత్రి అంతా ఎంసీడీ సదన్ లో హైడ్రామా కొనసాగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికను మేయర్ రేపటికి వాయిదా వేశారు.

Ruckus overnight in the election of Delhi Municipal Corporation permanent committee
Ruckus overnight in the election of Delhi Municipal Corporation permanent committee

 

దీనిపై మేయర్ షెల్లీ ఒబెరాయ్ బీజేపీ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుండగా బీజేపీ సభ్యులు వెల్ లోకి రావడమే కాకుండా తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మహిళా మేయర్ పై దాడికి యత్నించడం బీజేపీ నేతల గుండాగిరికి నిదర్శనమని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. సదన్ లో బీజేపీ సభ్యుల ప్రవర్తన దిగ్భాంతి కలిగించిందని, ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.

Ruckus overnight in the election of Delhi Municipal Corporation permanent committee

 

తీవ్ర ఉత్కంఠ మధ్య బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయి బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తా పై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సారి ఓటమి పాలైంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యత సాధించినప్పటికీ నామినేటెడ్ సభ్యుల బలంతో మేయర్ పీఠాన్ని దగ్గించుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!