Sachin Tendulkar : ఇటీవల కరోనా బారిన పడ్డ .. సచిన్ టెండూల్కర్ ఆసుపత్రిలో చేరారు.. కరోనా లక్షణాలు ఎక్కువ ఉండటంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్యుల సలహా మేరకు తను ఆసుపత్రిలో చేరుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్వీట్ చేశాడు .. మార్చి 27న సచిన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు..
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు రేపుతోంది.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 81, 466 కేసులు నమోదవడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్ 2 తర్వాత దేశంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అంటే 182 రోజులు తర్వాత ఈ రేంజ్ లో కేసులు రికార్డ్ అయ్యాయి.. కరోనా తో 469 మంది చనిపోయారు. 117 రోజుల తర్వాత అత్యధిక మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.