SBI New Scheme: కరోనా కష్టకాలంలో ఆసుపత్రి ఖర్చులతో కూడా సహాయం చేసే వారు లేరు.. బయట ఎవరినైనా అడిగి తెచ్చుకుందాం అంటే అధిక వడ్డీ.. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ సెక్యూరిటీ అవసరం లేని “కవచ్ పర్సనల్ లోన్” ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఈ లోన్ కోవిడ్ పేషంట్స్ ట్రీట్మెంట్ కు, వారి ఇంట్లో వారికి కూడా దీని వలన లాభం చేకూరుతుంది..!!
Read More: ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్..
కోవిడ్ మెడికల్ ఖర్చులను పే చేయడానికి వీలవుతుందని ఎస్బిఐ ఈ స్కీంను ప్రవేశపెట్టింది..ఎస్బిఐ కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.. దీనిని ఎస్బిఐ బ్యాంక్ 8.5 శాతం ఇంట్రెస్ట్ రేట్ కి అందిస్తుంది. అంతేకాకుండా ఈ లోన్ తీసుకున్నవారు మొదటి మూడు నెలలు ఈఎంఐ చెల్లించినవసరం లేదని స్పష్టం చేసింది. కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ ను ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖరా లాంచ్ చేశారు. ఈ స్కీం ని ప్రవేశపెట్టినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సరే కరోనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, ఈ మహమ్మారి సమయంలో ఇది చాలా మందికి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నట్లు దినేష్ ఖరా తెలిపారు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా అతి తక్కువ వడ్డీకి ఎస్బిఐ కవచ్ పర్సనల్ లోన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు ఎస్బిఐ ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.