Shiv Sena: సుప్రీం కోర్టులో షిండే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శివసేన సంక్షోభ వివాదం విస్తృత ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఆ రాష్ట్ర స్పీకర్ నిర్ణయాలను సుప్రీం తప్పుబట్టింది. షిండే వర్గానికి చెందిన గోగావాలే ను శివసేన చీఫ్ విప్ గా స్పీకర్ నియమించడం చట్టవిరుద్దమని తెలిపింది. పార్టీ నిర్ణయించిన విప్ ను మాత్రమే గుర్తించాలని చెప్పింది. అధికారిక విప్ ను గుర్తించడంలో స్పీకర్ విఫలమయ్యారని వెల్లడించింది. రెండు వర్గాల విభేదాల పై స్పీకర్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శివసేన ఉద్దవ్ వర్గం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషనర్ల పై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పార్టీల వివాదం పరిష్కారానికి విశ్వాస పరీక్ష ఒక్కటే మార్గం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.
ఎమ్మెల్యేల అన్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున ఉద్దవ్ ఠాక్రే ను సీఎంగా పునరుద్దరించలేమని స్పష్టం చేస్తూ..ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం మద్దతును ఏ విధంగా నిర్ణయించారన్న దానిపై పూర్తి స్థాయి విచారణ కోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేస్తుందని తెలిపింది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్దరించలేమని చెప్పడం ద్వారా షిండే వర్గానికి కొంతలో కొంత ఊరట లభించింది. అలాగే గవర్నర్ తీసుకున్న నిర్ణయం సక్రమంగా లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీంతో మహారాష్ట్ర సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలవరించే తీర్పు ఫైనల్ కానున్నది.
దాదాపు తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్దవ్ ఠాక్రే వర్గం తరపున కపిల్ సిబాల్, అషిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం తరపున హరీశ్ సాల్వే, ఎన్ కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవేళ ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు.
2022 జూన్ లో శివసేన కు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఎక్ నాథ్ షిండే కు మద్దతు ఇవ్వడంతో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా షిండే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్ నాథ్ షిండే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలంటూ ఉద్దవ్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Mudragada Padmanabham: కీలక నిర్ణయాన్ని వెల్లడించిన ముద్రగడ .. వైసీపీ వైపు అడుగులే(నా)..?