గుజరాత్ లో 2022 లో జరిగిన అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యకలాపాలను భారత్ లో పూర్తిగా నిషేదించాలని కోరుతూ హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా, బీరేంద్ర కుమార్ సింగ్ లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపిస్తూ.. భారత్ కు, భారత ప్రభుత్వానికి బీబీసీ వ్యతిరేకంగా పని చేస్తొందని ఆరోపించారు. ఈ క్రమంలోనే భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా తాజా లఘు చిత్రాన్ని (డాక్యుమెంటరీ) రూపొందించిందనీ, దీని వెనుక కుట్ర ను బహిర్గతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషనర్ అభ్యర్ధనను విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం .. ఓ డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించారు. దీనిని తప్పుగా భావించారనీ, ఇది విచారణకు అనర్హమని పేర్కొంది. నిషేదంపై అదేసాలు న్యాయస్థానం ఎలా జారీ చేస్తుందని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఈ పిటిషన్ విచారణకు తిరస్కరించింది ధర్మాసనం.
మరో పక్క ఇండియా: ది మోడీ క్వశ్చన్ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీ పై ఆంక్షలను సవాల్ చేస్తూ సీనియర్ పాత్రికేయుడు ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కలిసి వేసిన పిటిషన్ తో పాటు మరో న్యాయవాది ఎంఎల్ శర్మ ధాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డాక్యుమెంటరీని నిషేదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి రికార్డులను మూడు వారాల్లో సమర్పించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన దర్మాసనం ఫిబ్రవరి 3న కేంద్రానిన ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.
ఏపి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు కు కేంద్రం అఫిడవిట్.. ట్విస్ట్ ఏమిటంటే..?