Shiv Sena MP Sanjay Raut: కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవన్ నేతృత్వంలో ప్యూహాలు సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 15 రోజుల వ్యవధిలో రెండవ సారి శరద్ పవార్ తో భేటీ కావడం జరిగింది. నిన్న శరద్ పవార్ తదితర ముఖ్య నేతలతో ప్రశాంత్ కిషోర్ (పీకే) సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వివిధ పార్టీలకు చెందిన 15 మంది ముఖ్య నేతలతో శరద్ పవార్ నివాసంలో సమావేశం అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా విభిన్న రాజకీయ పార్టీలను ఒకే గొడుగు కిందికి చేర్చి తృతీయ కూటమిగా ఒకటయ్యేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో భాగంగా ఢిల్లీలో నేడు శరద్ పవార్, ఇటీవలే టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత షరూక్ అబ్దుల్లా, అప్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డీ రాజా సహా 15 మంది నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు యశ్వంత్ సిన్హా ఆహ్వాన లేఖలు పంపారు. వీరితో పాటు మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషి, సీనియర్ న్యాయవాది కేటిఎస్ తులసి, బాలీవుడ్ ప్రముఖులు జావెద్ అఖ్తర్, ప్రీతీష్ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ వంటి ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హజరవుతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఈ సమావేశంలో శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు.
Read More: Fraud: ఒకే వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..! ఈ ద్విపాత్రాభినయం ఎలా బయటపడిందంటే..!?
శరద్ పవార్ చాలా పెద్ద రాజకీయ నాయకుడు, ఆయనను రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ వంటి వివిధ సమస్యలపై చాలా మంది సంప్రదిస్తుంటారని పేర్కొన్న సంజయ్ రౌత్.. ఇది ప్రతిపక్ష పార్టీల సమావేశంగా భావించడం లేదన్నారు. ఈ సమావేశానికి ఎస్పీ, బీఎస్పీ, వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు హజరుకావడం లేదని సంజయ్ రౌత్ అన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.