Delta: కరోనా కలకలంలో భాగంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో డెల్టా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 100 దేశాల్లో ప్రమాదకరంగా డెల్టా వేరియంట్ కేసులు నమోదవ్వడాన్ని గుర్తించామని అధనోమ్ తెలిపారు. కరోనా ప్రభావం మొదలయ్యాక ఇది అత్యంత ప్రమాదకర సమయమని హెచ్చరించారు.
Read More: Corona: కరోనా వ్యాక్సిన్.. ఓ గుడ్ న్యూస్.. ఇంకో బ్యాడ్ న్యూస్
డెల్టా వేరియంట్ కలకలం…
డెల్టా వేరియంట్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ డేంజరస్గా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోస్ అన్నారు. మహమ్మారి బారి నుంచి బయట పడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ టైమ్కు ప్రతి దేశంలో ఆ కంట్రీ జనాభాలో 70 శాతం మందికి టీకాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు అన్ని దేశాలు కలసికట్టుగా, పరస్పరం ఒకరికొకరు సహకరిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్లలకు కరోనా ముప్పు తక్కువట
భారత్లో ఓ గుడ్ న్యూస్…
ఇదిలా ఉండగా భారత్ లో ఓ గుడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. అమెరికా తయారీ వ్యాక్సిన్ మోడెర్నా మరో 2-3 రోజుల్లో ఇండియాలోకి రానుంది. మోడెర్నా వ్యాక్సిన్ ను తెచ్చేందుకు సిప్లా సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ వ్యాక్సిన్ సరఫరా జరుగనుంది. మోడెర్నా టీకాను పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. భారత్లో ఉపయోగించే వ్యాక్సిన్లలో మోడెర్నా నాలుగో వ్యాక్సిన్. ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లను వాడుతున్నారు. మోడెర్నా తొలిడోస్ టీకా తీసుకున్నాక 94.1శాతం రక్షణ లభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సార్స్ కొవ్-2తో పాటు బి.1.1.7, 501 వై.వి2తో పాటు ఇతర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?