కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటి సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ ధవర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లక్షలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు హజరైయ్యారు. వారి సమక్షంలో వారి అభిమాన నేతలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరైన్, ఎన్సీపీ నేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, టీఎంసీ తరుపున ఆ పార్టీ ఎంపీ కాకాలి ఘోష్ దస్తిదార్ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హజరైయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలో స్వచ్చమైన, అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత పార్టీ విక్టరీపై అనేక కథనాలు, విశ్లేషణలు వచ్చాయి కానీ కాంగ్రెస్ పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వైపు నిలబడినందుకే గెలిచిందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పేదలు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పక్షాన నిజం ఉంది, బీజేపీ కి డబ్బు ఉంది. పోలీసులు అండగా ఉన్నారని అయినా ప్రజలు బీజేపీని ఓడించారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిదు వాగ్దానాలను చేసిందనీ, అవి కర్ణాటక ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టంగా మారుతాయని రాహుల్ గాంధీ ప్రకటించారు.
NTR Satha Jayanthi: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా .. రీజన్ ఇదే..!