Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 2వ తేదీన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స పొందుతున్నారు. అయితే కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సోనియా గాంధీ కోవిడ్ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారనీ రణ్ దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మరి కొన్ని రోజులు సోనియా ఆసుపత్రిలో ఉంటారనీ, ఆమె అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రణ్ దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నెషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హజరుకావాల్సి ఉండగా కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నందున మూడు వారాల గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 23వ తేదీన విచారణకు హజరుకావాలని ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో రాహుల్ గాంధీ ఈ నెల 13న (రేపు) ఈడీ ముందు విచారణకు హజరుకానున్నారు. తొలుత రాహుల్ గాంధీకి ఈ నెల 2వ తేదీ హజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేయగా, ఆయన ముందుగా నిర్ణయించుుకన్న కార్యక్రమాల్లో ఉండటం వల్ల సమయం కావాలని ఈడీని కోరారు. దీంతో ఈ నెల 13న విచారణకు హజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు రాహుల్ గాంధీ విచారణకు హజరయ్యే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తొంది.