Supreme Court: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ఎన్ వి రమణ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకట రమణ, పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్ వి రమణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎన్ వి రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26వ వరకూ అంటే 16 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తి గా కొనసాగనున్నారు. భారత దేశ చరిత్రలో 54 ఏళ్ల తరువాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయ పీఠం అధిరోహించారు. గతంలో 1966 – 67 లో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐ గా బాధ్యతలు నిర్వహించారు.