Supreme Court: 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఫలితాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా అదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ ల అభ్యర్థనను ధర్మాసనం తోసి పుచ్చింది.
“ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందువల్ల బోర్డులు తమ సొంత మూల్యాంకన విధానాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి జూలై 31లోగా ఫలితాలు వెల్లడించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read More: Visakha: విశాఖ పరిపాలనా రాజధాని అయిపోయింది..! ఇదిగో సాక్షం..!?
తొలుత సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులకు కూడా సుప్రీం ధర్మాసనం ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా బోర్డులు ధర్మాసనానికి తమ మూల్యాంకన విధానాన్ని వివరించాయి. వచ్చే నెల 31వ తేదీలోగా 12వ తరగతి ఫలితాలును ప్రకటిస్తామని వెల్లడించాయి.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకూ దేశంలోని 21 రాష్ట్రాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఆరు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. ఏపి కూడా వచ్చే జూలై నెలలో పరీక్షలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండగా దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.
Read More: AP High Court: మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట