Supreme Court: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరికి సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇందుకోసం ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని సుప్రీం కోర్టు ఉపయోగించింది. 31 సంవత్సరాలుగా ఏజి పెరరివలన్ రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష అనువిస్తున్న పెరారివలన్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తుండటంతో..
1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని హత్య చేశారు. అదే యేడాది జూన్ 11న చెన్నైలో పెరరివలన్ ను అరెస్టు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పరికరాలను అందించారన్న అభియోగంపై పెరరివలన్ ను పిన్న వయస్సులో అరెస్టు చేశారు. ఈ కేసులో పెరారివలన్, మురుగన్, సంతన్, నళినిలకు దిగువ కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఆ తరువాత వారి క్షమాభిక్ష పిటిషన్ పై కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివలన్ మరణశిక్షను సుప్రీం ధర్మాసనం 2014లో జీవిత ఖైదుగా మార్చింది.
Supreme Court: ఆర్టికల్ 142 ప్రకారం
కాగా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివలన్ (47) తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్టికల్ 142 ప్రకారం దోషిని విడుదల చేయడం సముచితమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెరోల్ పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడంతో పాటు సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి 8న పెరారివలన్ కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఇప్పుడు పెరారివలన్ విడుదలకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.