ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ గూగుల్ ధాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అండ్రాయిడ్ కు సంబంధించి తన ఆధిక్యతను గూగుల్ దుర్వినియోగం చేసొందని, కాంపిటేషన్ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ లో గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందని గతంలో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,337 కోట్లు జరిమానా విధించగా, దీనిపై గూగుల్ ఎన్సీఎల్ఏటీ ని ఆశ్రయించింది. ఎన్సీఎల్ఏటీలో తీర్పు వ్యతిరేకంగా రాగా గూగుల్ ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
Supreme Courtఎన్సీఎల్ఏపీ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తిసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గూగుల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తిరిగి ఈ కేసును ఎన్సీఎల్ఏపీకి బదిలీ చేసింది. కేసు విచారణకు మార్చి 31వ తేదీ గడువుగా ఎన్సీఎల్ఏటీకి నిర్దేశించింది. అంతే కాకుండా సీసీఐ గతంలో విధించిన జరిమానాలో పది శాతం సొమ్మును వారం రోజుల లోగా చెల్లించాలని గూగుల్ కు సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో గూగుల్ వారం రోజుల్లోగా 133.7 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపి ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?