Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలోని జహీంగీర్పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జహీంగీర్పురి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ప్రొక్లైయిన్ తో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్బంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా..నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ను వెంటనే నిలిపివేయాలనీ, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. నికి సంబంధించిన విచారణను రేపు చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. మరో పక్క స్థానిక కార్పోరేషన్ అధికారుల చర్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Supreme Court: ఈ డ్రైవ్ రోజువారీ కార్యక్రమాల్లో భాగమే
రెండు రోజుల క్రితం జహీంగీర్పురిలో రెండు వర్గాల ఘర్షణల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకల ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేశ్ గుప్తా మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కు లేఖ రాశారు. ఆ తరువాత మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభించారు. అయితే ఈ డ్రైవ్ రోజువారీ కార్యక్రమాల్లో భాగమేననీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. బీజేపీ నేత లేఖ రాసిన తరువాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభించడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియ నిలిపివేశామని మేయర్ ఇక్బాల్ సింగ్ వెల్లడించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
‘బుల్డోజర్లను ఆపివేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి’
ఢిల్లీలో అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. కేంద్రంపై ఆయన మండిపడ్డారు. వెంటనే ధ్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేయండని విమర్శించారు. ఈ ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా కేవలం 8 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి మోడీజీ..ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. విద్యుత్ కోత చిన్న పరిశ్రమలను ధ్వంసం చేస్తోంది. ఇది మరింత నిరుద్యోగానికి దారి తీస్తుంది. అందుకే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేసి పవర్ ప్లాంట్లను ఆన్ చేయండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
8 years of big talk has resulted in India having ONLY 8 DAYS of coal stocks.
Modi ji, stagflation is looming. Power cuts will crush small industries, leading to more job losses.
Switch off the bulldozers of hate and switch on the power plants! pic.twitter.com/CiqP9SlHMx
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2022
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews