Pakisthan : ప్రపంచంలో సర్జికల్ స్ట్రైక్ చేయటంలో ముందుండే దేశం ఇజ్రాయిల్. చాలా చిన్న దేశం అయినా గాని అరబ్ కంట్రీ ల మధ్య అతి తక్కువ జనాభా కలిగిన దేశం అయినా గాని చుట్టుపక్కల పది అరబ్ దేశాలకు చుక్కలు చాలాసార్లు చూపించింది ఇజ్రాయిల్. ఆసియాలో ఇండియాకి అయితే నమ్మకమైన స్నేహం కలిగిన దేశం కూడా ఇజ్రాయిల్. ఇదిలా ఉంటే సర్జికల్ స్ట్రైక్ పాకిస్థాన్ దేశంలో గతంలో ఇండియా చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్థాన్ దేశం పై ఇరాన్ దేశం చేయడం జరిగింది.
ఇరాన్ దేశానికి చెందిన ఇద్దరు సైనికులను పాకిస్తాన్ లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడంతో ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి సమయంలో.. పాకిస్తాన్ ఆర్మీ కి తెలియకుండా ఇరాన్ దేశం మిలటరీ బలగాలు వారి భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టి, వారి దేశానికి చెందిన ఇద్దరు సైనికులను విడిపించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రాంతానికి కాపలాగా ఉన్న కొందరు పాకిస్తాన్ ఆర్మీ అధికారులను కూడా కూడా చంపినట్లు ఇరాన్ మిలట్రీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. తమ దేశానికి చెందిన సైనికులు క్షేమంగా వచ్చినట్లు పాకిస్తాన్ దేశం పై సర్జికల్ స్ట్రైక్ విజయవంతమైనట్లు తాజాగా ఇరాన్ దేశం ప్రకటించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ ఆర్మీ వర్గాలకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?