తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి, గవర్నర్ రవికి మధ్య వివాదం తారా స్థాయికి చేరుతోంది. ఇంతకు ముందు నుండే సీఎంఒ, రాజ్ భవన్ మధ్య విభేదాలు కొనసాగుతుండగా, ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ రవి మార్పు చేసి ప్రసంగించారు. ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, తమిళనాడు దివంగత నేతలు పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిది వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను చేర్చారు. ప్రసంగంలో మార్పులను గమనించిన సీఎం స్టాలిన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో గవర్నర్ రవి సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
అనంతరం డీఎంకే నేతలు గోబ్యాక్ రవి అంటూ పోస్టర్ లు వేసి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా గవర్నర్ చర్యను నిరసిస్తూ పోస్టులు పెట్టారు. గవర్నర్ రవి ప్రవర్తనపై తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో గవర్నర్ రవిపై డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును గవర్నర్ చెప్పకపోతే ఆయన కశ్మీర్ వెళ్లాలనీ, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.
భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా అసలు గవర్నర్ రాజ్యంగం పేరుతో ప్రమాణం చేయలేదా, దాన్ని రాసింది అంబేద్కర్ కాదా. . రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు అంటూ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. శివాజీ కృష్ణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. గవర్నర్ బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. డీఎంకే కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెన్నై పోలీసులకు గవర్నర్ డిప్యూటి సెక్రటరీ ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును సీపీ .. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపించారు.
మరో సారి సీబీఐ సోదాలు .. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా ఏమన్నారంటే..?