Tarun Tejpal Case: అత్యాచారం కేసులో తేహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ నిర్దోషిగా తేలుస్తూ ఇటీవల గోవా కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే గోవా కోర్టు తీర్పుపై బాంబాయి హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లాలని గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.
2013 లో థింక్ ఇన్ గోవా సమావేశంలో తనను తరుణ్ తేజ్ పాల్ లైంగికంగా వేధించారంటూ తెహల్క.కమ్ లో పని చేసే ఓ మహిళా జర్నిలిస్ట్ ఫిర్యాదు చేసింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై అదే ఏడాది నవంబర్ 30వ తేదీన గోవా పోలీసులు తరుణ్ తేజ్ పాల్ ను అరెస్టు చేశారు. అయితే దీనిపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారనీ, కేసును కొట్టివేయాలని తరుణ్ తేజ్ పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం 2014 జూలై 1న బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు రద్దు చేయాలన్న పిటిషన్ ను మత్రం సుప్రీం కోర్టు కొట్టివేసింది.
Read More: CBI: బిగ్ బ్రేకింగ్.. సీబీఐ కొత్త బాస్గా సుబోధ్ కుమార్ జైస్వాల్
దీంతో గోవా కోర్టులో కేసు విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న గోవా కోర్టు ఈ నెల 21న తీర్పు వెల్లడించింది. తరుణ్ తేజ్ పాల్ నిర్ధోషి అని పేర్కొంది. దాదాపు ఏడేళ్ల తరువాత తీర్పు వెలువడింది. ఈ తీర్పును బాంబాయి హైకోర్టులో సవాల్ చేయాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది.