Revanth Reddy: సుదీర్ఘకాలంగా కొనసాగిన ఉత్కంఠ అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి కి కట్టబెట్టినట్లే, కాంగ్రెస్ పార్టీ మరో కీలక రాష్ట్రంలోనూ యువ నేతకు పట్టం కట్టబెట్టింది. తద్వారా ఆ రాష్ట్ర యువనేతకు షాక్ ఇచ్చింది. ఇదంతా పంజాబ్ కాంగ్రెస్ నాయకత్వం గురించి. పంజాబ్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చాన్స్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ఆమోద ముద్ర వేసి వివాదానికి తెర దించింది.
read more : Revanth Reddy: కాంగ్రెస్లో శత్రువులను పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి
ఇది వివాదం…
వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం అమరిందర్ సింగ్, ఎమ్మెల్యే సిద్ధూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చాన్స్ ఇస్తారనడంతో ఈ రచ్చ మరింత ముదిరింది. సిద్దూ నియామకానికి వ్యతిరేకంగా సీఎం కెప్టెన్ అమరీందర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్తో సీఎం అమరిందర్ సిద్దూతో సమావేశం అయ్యారు. అనంతరం వెనక్కి తగ్గిన సీఎం అమరిందర్ సింగ్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
Read More: Revanth Reddy: ఇటు కేటీఆర్ను అటు కిషన్ రెడ్డిని కెలికిన రేవంత్
ఇంకో నలుగురికి చాన్స్…
పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూని నియమించిన కాంగ్రెస్ పార్టీ మరో నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా యువనేత సిద్దూకు చాన్సిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎపిసోడ్ ద్వారా సీనియర్ నేత అయిన సీఎం అమరిందర్ సింగ్కు షాకిచ్చిందని అంటున్నారు. తెలంగాణలో యువనేత రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లే పంజాబ్లోనూ కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించారని అంటున్నారు.