Tokyo Olympics: టోక్యోలో ఉత్సాహభరితంగా ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ క్రీడా పోటీల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఒలింపిక్ క్రీడలు ఎట్టకేలకు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా భారత బృందం క్రీడాకారులు భారత జాతీయ పతాకం మువ్వన్నెల జెండాతో పాల్గొన్నారు. టోక్యోలో జరుగుతున్న ఈ ఒలంపిక్ క్రీడా పోటీల మహోత్సవాన్ని జపాన్ చక్రవర్తి నరమితో ప్రారంభించగా కరోనా నేపథ్యంలో కేవలం వెయ్యి మంది అతిధుల మధ్య ఆరంభమయ్యాయి.
ఈ వేడుకల్లో భారత పురుషుల హాకీ టీం కెప్టెన్ మన్ ప్రిత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీ కోం భారత జాతీయ జండాను పట్టుకుని కీడాకారులను ముందుకు నడిపించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా క్రీడాకారులను అభినందించారు. క్రీడాకారులు జాతీయ గీతం ఆలపించిన సమయంలో ప్రధాని మోడీ కుర్చీ నుండి లేచి నిల్చుని మరీ చప్పట్లుతో అభినందనలు తెలియజేశారు.
#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021