Fauci: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఆమెరికా అంటు వ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ పౌచీ పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని డాక్టర్ పౌచీ సమర్థించారు. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పుడు ఎక్కువ మందికి తొలి డోసు ఇవ్వడానికి ఇది సరైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతం చేయడం ద్వారానే మహమ్మారిని నియంత్రణ సాధ్యమని అన్నారు. అవసరమైన మేర వ్యాక్సిన్ లను సమకూర్చుకునేందుకు ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటి వరకూ తక్కువ శాతం మందికి మాత్రమే టీకా రెండు డోసులు అందాయన్నారు. అలాగే సుమారు పది శాతం మందికి సింగిల్ డోస్ అంది ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేసి ఎక్కువ మందికి టీకాలు అందజేయాలన్నారు. భారత్ అతి పెద్ద టీకా తయారీ సామర్థ్యం ఉన్న దేశమని పౌచీ గుర్తు చేస్తూ ఇతర దేశాలు, కంపెనీల తో సమన్వయం చేసుకుని భారీ ఎత్తున టీకా లను సమకూర్చుకోవాలని సూచించారు.
కోవిడ్పై చేస్తున్న పోరులో అవసరమైతే మిలటరీ సేవలను కూడా ఉపయోగించుకోవాలని డాక్టర్ పౌచీ సూచించారు. భారత్ ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడేందుకు తక్షణం సైన్యం సహాయంతో క్షేత్ర స్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటు లోకి తీసుకురావడం మంచిదని డాక్టర్ పౌచీ అభిప్రాయపడ్డారు.
#WATCH When you don't have enough vaccines, extending duration b/w 1st & 2nd dose to get more people to at least get 1st dose is a reasonable approach. Unlikely that long delay would've negative effect on vaccine efficacy: Dr Anthony Fauci, top US infectious disease expert to ANI pic.twitter.com/25cO35jgR2
— ANI (@ANI) May 14, 2021