మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూడి అందులో భక్తులు పడిపోయారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హజరైయ్యారు. స్థలం సరిపోకపోవడంతో కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల బావిపై కూర్చున్నారు. అయితే అకస్మాత్తుగా బావి పైకప్పు కూలిపోవడంతో దాదాపు 25 మంది భక్తులు అందులో పడిపోయారు.
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో బావిలో పడిన భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ పది మందిని కాపాడి వారిని ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తొంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బావిలో పడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన .. చివరి నిమిషంలో మరో కీలక మంత్రితో భేటీ