Twist In Marriage: పూర్వకాలం వివాహ నిశ్చితార్ధం చేసుకోవాలంటే అడు ఏడు తరాలు ఇటు ఏడు తరాల గురించి తెలుసుకునే వారట. జనరేషన్ లో మార్పు వచ్చిన తరువాత చాలా మందికి వారి తాతలు, ముత్తాతల గురించే పూర్తిగా తెలియని పరిస్థితులు ఉన్నాయి. రెండు మూడు తరాల గురించి చెప్పడమే కష్టంగా మారిన రోజులు ఇవి. దానికి తోడు బంధువుల్లో అమ్మాయికి, అమ్మాయి. అమ్మాయికి అబ్బాయిలు దొరికే పరిస్థితులు లేక బయటి సంబంధాలను చూసుకుంటున్నారు.
ఆ యువకుడికి గురించి యువతి తరుపు వారికి, యువతి గురించి యువకుడి తరపు వారికి ఏమి పరిచయం కూడా లేకుండానే మధ్యవర్తులు (ఏజంట్స్) ద్వారా వివాహ నిశ్చితార్ధాలు ఎక్కువగా జరుగుతుంటున్నాయి. దీంతో యువకుడికి గురించి గానీ, యువతి గురించి గానీ ఏమైనా విషయాలు ఉంటే అవి తెలియనీయకుండా, బయటకు పొక్కకుండా ఏజంట్ లు సంబంధాలను కుదిర్చేసి తమ పని అయి పోయింది వెళ్లిపోతుంటారు. ఇలా ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడం వల్ల వివాహం అయిన తరువాత ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కొందరు సర్దుకుపోయి జీవనాన్ని సాగిస్తుండగా, సర్దుబాటు కాని కొన్ని పెటాకులు అవుతుంటాయి. సరిగ్గా అటువంటిదే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
Read More: Karnam Malleswari: పద్మశ్రీ కరణం మల్లీశ్వరికి కీలక పదవి
విషయంలోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ శాస్త్రినగర్ కు చెందిన యువకుడికి పంకి ఏరియాకు చెందిన యువతితో ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అయితే వివాహం అయిన తరువాత యువతి తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో శోభనం కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యంకు వైద్యం చేయించాలని ఆ యువతిని భర్త ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తమ సమస్య వైద్యురాలికి వివరించాడు. అయితే యువతిని పరీక్ష నిర్వహించిన వైద్యురాలు చెప్పిన విషయానికి ఆమె భర్త ఒక్క సారిగా షాక్ కు గురైయ్యాడు. తాను వివాహం చేసుకుంది యువతిని కాదనీ హిజ్రాను అని తేలడంతో అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత్తమామ, బావమరుదులపై తనకు మోసం చేసి హిజ్రాను కట్టబెట్టారని పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.