Twitter: గత కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వం మరియు ట్విట్టర్ ల మధ్య నిబంధనల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం తెచ్చిన ఐటీ నిబంధనలను అమలు చేసేందుకు ట్విట్టర్ సంసిద్ధంగా లేని సంగతి తెలిసిందే. అయితే, ట్విట్టర్ను కేంద్రం ఉపేక్షించడం లేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు ట్విట్టర్కు చుక్కలు చూపించింది.
Read More: Modi : మోడీ కొత్త క్యాబినెట్ టీం ఇదే… పదవి పోయే మంత్రులు ఎవరంటే…
ట్విట్టర్పై కోర్టు ఆగ్రహం…
భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త రూల్స్ పాటించడం లేదని అడ్వకేట్ అమిత్ ఆచార్య ట్విట్టర్ సంస్థకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను ట్విట్టర్ ధిక్కరించాలనుకుంటుందా? అంటూ ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించగా.. ఆయన రాజీనామా చేశారని.. మరో కొత్త గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవాల్సి ఉందని ట్విట్టర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీలైనంత త్వరగా నియామకం పూర్తి చేయాలి. రేపు, మాపు అంటూ కాలం గడిపితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ రేఖా పల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాకపోతే.. ఇలా నవ్వుల పాలు అవడం ఏంటి!
కోర్టును బతిమాలుకొని…
కొత్త ఐటీ నిబంధనలను ఇంకా అమలు చేయలేదని.. త్వరలోనే కొత్త నిబంధనలకు అనుగుణంగా అధికారులను నియమించుకుంటున్నామని ట్విట్టర్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. కోర్టుకు సమాధానం చెప్పే వరకు ట్విట్టర్ కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కంపెనీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది. తాజాగా కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పుతో ట్విట్టర్ దూకుడు తగ్గుతుందని, కేంద్రం చెప్పినట్లు దారికి వస్తుందని అంచనా వేస్తున్నారు.