Twitter Controversy: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ వెబ్ సైట్ లో ఓ తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్ సీనియర్ అధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటి నిబంధనలను అమలు చేయనందుకు భారత్ లో ట్విట్టర్ తన మద్య వర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని ఘాజియాబాద్ లో ఓ వృద్ధుడి పై దాడి ఘటనలో గత వారం అక్కడి పోలీసులు ట్విట్టర్ ఎండీపై కేసు నమోదు చేయడంతో పాటు వివరణ ఇవ్వాలంటూ సమన్లు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ట్విట్టర్ ఎండి కర్నాటక హైకోర్టు ఆశ్రయించి యాంటిసిపెటరీ బెయిల్ పొందారు.
Read More: Megastar Chiru: చిరంజీవి చిదంబర రహస్యం చెప్పేసిన కాంగ్రెస్ సీనియర్ నేత! అసలు విషయం అదంట!!
యూపిలో ట్విట్టర్ ఎండీపై కేసు నమోదు
కేంద్రం, ట్విట్టర్ మధ్య ఐటీ నిబంధనల విషయంలో గత కొద్ది రోజులుగా ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలోనే తాజాగా భారత్ లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్ ను ట్విట్టర్ సోమవారం తమ వెబ్ సైట్ లో ప్రదర్శించడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ట్విట్టర్ పై నెటిజన్ లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ను బ్యాన్ చేయాలంటూ వేలాది మంది పోస్టులు పెట్టారు. దీనిపై యుపీలోని భజరంగ్ దళ్ కార్యకర్త ఖుజ్రానగర్ పోలీసు స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ట్విట్టర్ భారత విభాగం ఎండీ మనీశ్ మహేశ్వరి తో పాటు న్యూస్ పార్టనర్ షిప్ హెడ్ అమృతా తిపాఠిపై కేసు నమోదైంది.
Twitter Controversy: వంకర బుద్ది పోనిచ్చుకోని ట్విట్టర్
దేశ భౌగోళిక సరిహద్దులను ట్విట్టర్ ఇలా తప్పుగా చూపడం ఇదే ప్రధమం కాదు. గత అక్టోబర్ నెలలో లేహ్ ను చైనా అంతర్బాగంగా చూపించింది. దీనిపై నాడే కేంద్రం సీరియస్ గా హెచ్చరిక జారీ చేసింది. దేశ సౌర్వభౌమత్వం, సమగ్రతలను ఏ మాత్రం అగౌరవపరిచినా సహించేది లేదంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని కేంద్రం హెచ్చరించింది. అయినప్పటికీ ట్విట్టర్ మరో సారి తన వక్రబుద్దిని ప్రదర్శించి భారత్ లోని అంతర్భాగమైన జమ్మకశ్రీర్. లద్ధాఖ్ ను వేరే దేశంగా మ్యాప్ లో చూపింది. ఇదే విధంగా ప్రవర్తిస్తే ముందుముందు ట్విట్టర్ కు మరింత కష్టాలు రావడం ఖాయమే.