Twitter: భారత్ లో కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటి నిబంధనలకు అనుగుణంగా భారత్ లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ అధికారి చతుర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. కొత్త డిజిటల్ నిబంధనల ప్రకారం ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన కొద్ది రోజులకే బాధ్యతల నుండి ఎందుకు తప్పుకున్నారు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. గ్రీవెన్స్ అధికారి స్థానంలో చతుల్ పేరును ట్విట్టర్ తొలగించింది. ప్రస్తుతం ఇండియా గ్రీవెన్స్ అధికారి స్థానంలో ట్విట్టర్ కంపెనీ పేరు. ఆమెరికా అడ్రస్, ఈమెయిల్ ఐడీతో కూడి మరొకరి పేరు కనిపిస్తోంది. కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నడుస్తున్న వేళ గ్రీవెన్స్ అధికారి బాధ్యతల నుండి తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
Read More: MAA Polls: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు మనోగతం ఇది..!!
డిజిటల్ మీడియాకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా సంస్థలు గ్రీవెన్స్ అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను స్వీకరించడం, ఎవరైనా అభ్యంతరకరమైన కంటెంట్ పోస్టు చేస్తే తొలగించడం వంటివి చేయాలి. యూజర్లు, బాధితులు చేసే ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ మెకానిజం ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 50లక్షల యూజర్లు కల్గిన సోషల్ మీడియా సంస్థలు తప్పకుండా గ్రీవెన్స్ అఫీసర్ ను నియమించారి. సదరు అధికారి పేరు, ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలి. కొత్త ఐటీ నిబంధనలు అమలులో ట్విట్టర్ తీవ్ర ఆలస్యం చేసింది.
ఈ క్రమంలో కేంద్రం ఆ సంస్థకు వరుసగా నోటీసులు జారీ చేసింది. కేంద్రం పంపిన చివరి నోటీసుకు ట్విట్టర్ స్పందించి చీఫ్ కాంప్లియన్స్ అధికారిని నియమిస్తామని వెల్లడించింది, తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ధర్మేంద్ర చతుర్ ను నియమించగా ఆయన కొద్ది రోజులకే విధుల నుండి తప్పుకున్నారు. దేశంలో నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందు వల్ల ట్విట్టర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మధ్యవర్తి హోదా కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్విట్టర్ పై పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి.