Twitter: సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ కు షాకులు తప్పేలా లేవు. ఇటీవలి కాలంలో ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రముఖులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి అకౌంట్ కు కూడా బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే తప్పును సరిదిద్దుకుంది. మరోవైపు కేంద్రానికి కంటగింపుగా మారిన ఈ సామాజిక మాధ్యమం విషయంలో కన్నెర్ర చేయడ ఖాయమంటున్నారు.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం…
డిజిటల్ మీడియా లో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ రూల్స్ను ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ను అమలు పరచడం కోసం డిజిటల్ మీడియా సంస్థలకు మూడు నెలల గడువు కూడా ఇచ్చింది. అయితే ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం సోషల్ మీడియా సంస్థలు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారత్కు చెందిన వ్యక్తులను నియమించాలి. కానీ ఈ విషయంలో ట్విట్టర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చి వారం గడిచినా ట్విట్ట్రర్ స్పందించకపోవడంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘కొత్త ఐటీ రూల్స్ అమలు పరచడానికి ట్విట్టర్ సంస్థకు చివరిసారిగా నోటీస్ ఇచ్చాం. దానిని అనుసరించి నడుచుకోకపోతే ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం సంస్థ తన బాధ్యతలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ పూర్తి పరిణామానికి ట్విట్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ నోటీసులో పేర్కొంది.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
ఆఫ్రికా దేశంలో బ్యాన్..
ఇదిలాఉండగా, ఆఫ్రికా దేశం నైజీరియా ట్విట్టర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ట్విట్టర్ కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ అకౌంటన్ ను ట్విట్టర్ ఆపేయడంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రూల్స్ ను ముహమ్మదు అతిక్రమించారంటూ ఆయన అకౌంట్ ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. సాక్షాత్తు అధ్యక్షుడి ఖాతానే నిలిపేయడంతో.. ఆ దేశ ప్రభుత్వం ఫైర్ అయింది. నిరవధికంగా ట్విట్టర్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఆ దేశ సమాచార శాఖ తెలిపింది.