Twitter: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కొత్త ఐటీ చట్టం అమలుకు పట్టు పడుతుండగా మరో వైపు ట్విట్టర్ కేంద్ర హెచ్చికలు బేఖాతరు చేస్తూ తన సొంత నియమావళితోనే ముందుకు సాగుతోంది. రాజకీయ ప్రముఖులకే షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. శుక్రవారం దేశంలో ఇద్దరు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను నిలిపివేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంట పాటు ట్విట్టర్ నిలిపివేసింది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఐటీ) శశిధరూర్ ఖాతాను నిలిపివేసింది. ఆయన ఖాతాను రెండు సార్లు నిలిపివేసింది. ఈ పరిణామంపై శశిధరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read more: Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రశంసలు..!!
రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ తొలుత శశిధరూర్ ట్వీట్ చేశారు. దీంతో మరో మారు ధరూర్ ఖాతాను స్తంభింపజేసింది ట్విట్టర్. దీనిపై ఆయన థరూర్ స్పందించారు. ఇలా ఖాతాలను నిలుపుదల చేసే బదులు ఆ వీడియో కంటెంట్ డిజెబుల్ చేయవచ్చుకాదా అంటూ హితవు పలికారు. ట్విట్టర్ యాజమాన్యం మూర్ఖంగా వ్యవహరిస్తుందని థరూర్ అభిప్రాయపడ్డారు. ఖాతాలను నిలిపివేయడం మూర్ఖపు చర్యగా ఆయన అభివర్ణించారు. ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని థరూర్ వ్యాఖ్యానించారు.
ట్విట్టర్, కేంద్ర మధ్య వార్ పీక్ స్టేజికి చేరడంతో ఇండియాలో చట్టపరమైన రక్షణను ట్విట్టర్ కోల్పోయింది. దీంతో యూసర్ల అభ్యంతరకర పోస్టులకు ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్విట్టర్ పై యూ పీలో తొలి ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అదే మాదిరిగా ఇతర రాష్ట్రాల నుండి ట్విట్టర్ కు నోటీసులు వెళుతున్నాయి.