Bjp : బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుబట్టదు. ప్రధాని మోదీ ఏ సాయంత్రం వేళ టీవీ లో కనిపించి ఏ ప్రకటన చేస్తారో అన్న భయం చాలా మంది భారతీయుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వార్త అలాంటిది కాకపోయినా దానికి దగ్గరి సంబంధం ఉన్నదే. కేంద్ర ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా 2000 రూపాయల నోట్లు రద్దు చేసే అవకాశం ఉందని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చెబుతున్న కారణాలు కూడా ఊత్తం ఇస్తున్నాయి .
నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపివేసి రెండేళ్లు అయ్యింది. మళ్లీ ఎప్పుడూ దాని తర్వాత కొత్త నోట్లు ముద్రించ లేదు. భారతదేశ కరెన్సీలు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ముద్రిస్తారు. అయితే 2000 రూపాయల నోటు మాత్రం కొత్తగా ఎక్కడ ముద్రించడం ఆపేశారు. అంటే మొదటి ఏడాది ముద్రించిన నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. వాటి జీవిత కాలం అంటే నోటు తిరిగిపోయి లేదా నలిగిపోయి పోతే ఇక మరో కొత్త నోటు దాని స్థానంలో వచ్చే అవకాశం లేదు. అంటే వున్న రెండు వేల రూపాయల నోట్లు అన్నీ చైన్ లింక్ ద్వారా బ్యాంకు లో చేరితే ఆ నోట్లను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇది గత నోట్ల రద్దు కు పూర్తిగా భిన్నమైన చర్య.
** ఇదే విషయాన్ని లోక్సభకు అందించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2018 మార్చి 30 నాటికి రూ. 2000 నోట్లు.. చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో 3.27శాతంగా ఉండేవని ఠాకూర్ పేర్కొన్నారు.
2021 ఫిబ్రవరి 26 నాటికి అది 2.01శాతానికి (2,499 మిలియన్) పడిపోయిందని స్పష్టం చేశారు. 2019-20, 2020-21 కాలంలో రూ. 2వేల నోట్లను ముద్రించమని ప్రింటింగ్ ప్రెస్లకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదన్నారు ఠాకూర్రూ. 2వేలకు సంబంధించి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.99 మిలియన్ నోట్లను ముద్రించినట్టు ఆర్బీఐ 2019లో ప్రకటించింది. 2017-18లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించారు. 2018-19 నాటికి అది 46.690 మిలియన్కు పడిపోయింది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర 2000 రూపాయల నోటు ఉంటే వెంటనే వదిలించుకోవడం ఉత్తమమైన విషయం.