నిరుద్యోగులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. 2023 – 24 బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800 అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 740 పాఠశాలతో 3.5 లక్షల గిరిజన విద్యార్ధులకు వీరి ద్వారా సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

వైద్యరంగంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కళాశాలతో కలిపి మరో 157 కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలు, యుక్త వయస్సుల వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. భాషలు, కళలు, భౌగోళిక అంశాలకు సంబంధించి నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

బడ్జెట్ లో రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు, రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13,7లక్షల కోట్లు, కర్ణాటక సాగు రంగానికి రూ.5,300 కోట్లు, పీఎం ఆవాస్ యోజనకు రూ.79వేల కోట్లు, కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు, మూల ధన వ్యయాల మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయించారు. ఏడు ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.