Pasupati kumar paras: రాజకీయ నాయకులు తమ ప్రాణాలకు ప్రత్యర్థుల నుండి ముప్పు ఉంది, భద్రత కల్పించాలని కోరడం సహజం. కానీ సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రే తమ ప్రాణాలకు ముప్పు ఉంది. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కల్పించాలని కోరడం సంచలన వార్త అయ్యింది. బీహార్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం తీవ్ర సంచలనం అయ్యింది. ఇప్పటికే మంత్రి పరాస్ తన భద్రతా సమస్యలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కూడా లేఖ రాశారు. ఎల్జీపీకి చెందిన కేశవ్ సింగ్ ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా తనను బెదిరిస్తున్నారని మంత్రి పరాస్ ఆరోపించారు.
Read More: CBI in West Bengal: సీబీఐ ఏం చేయబోతుందో..!? బెంగాల్ లో కీలక పరిణామాలు – మమత ఇక మాజీ..!?
ఆగస్టు 23న తాను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీహార్లోని తన నియోజకవర్గమైన హాజీపూర్లో పర్యటించాననీ, అప్పుడు తనకు భారీ ప్రజా మద్దతు లభించడంతో రాజకీయ ప్రత్యర్థులు ఆశ్చర్యపోయారన్నారు. ఇటీవల హాజీపూర్ సందర్శన సందర్భంగా తన ప్రత్యర్థులు నియమించిన వ్యక్తులు నల్లజెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారనీ, ఆయిల్ కూడా తమ వర్గీయులపై విసిరారని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకుల్లో మరి కొంత మందికి కూడా బెదిరింపులు వచ్చాయని పరాస్ తెలిపారు.