Vaccine for Children: కరోనా సెకండ్ వేవ్ ముప్పు పూర్తిగా తొలిగిపోక ముందే గత కొద్ది రోజులు గా థర్డ్ వేర్ గురించి వార్తలు వస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టీకా సంస్థలు పాటాపోటీగా పిల్లల కోసం టీకాలను ఉత్పత్తి చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే మోడేర్నా టీకా 12 నుండి 17 ఏళ్లలోపు బాలలపై చేసిన ప్రయోగాల్లో నూరు శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది.
3,732 మంది బాలలపై మోడెర్నా టీకా ప్రయోగాలు నిర్వహించగా 93 శాతం సమర్థవంతంగా పని చేసినట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో ఎఫ్డీఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మోడెర్నా వ్యాక్సిన్ కు ఆమెరికాలో ఎఫ్డీఏ అనుమతులు ఉండగా టీకాను చిన్నారులకు కూడా ఉపయోగించేందుకు అనుమతిని విస్తరింపజేయాలని కోరనున్నది. ఎఫ్డీఏ అనుమతులు వస్తే టీకా ఉత్పత్తినిని మరింత పెంచనున్నది. ఇప్పటికే అమెరికాలో 12 నుండి 15 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఫైజర్ అనుమతి పొందిన విషయం తెలిసిందే.
Read More: Breaking: ఆకలి తీరుస్తామని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు..!!
మరో పక్క హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కూడా పిల్లల కోసం తయారు చేసిన కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ను ప్రారంభిస్తున్నది. మూడు దశల క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది. ఈ వారంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవ్వనున్నాయని సమాచారం. మరో రెండు నెలల్లో మూడు దశల ట్రయల్స్ పూర్తి అయితే ఆగస్టు నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ) కూడా చిల్డ్రన్స్ టీకా ఉత్పత్తి విషయాలపై ఆరా తీసుకున్నట్లు సమాచారం.