Kerala : అత్యంత అందమైన రాష్ట్రంగా , దేవతలు తిరిగే భూమి గా పిలుచుకునే కేరళలో ఇప్పుడు రాజకీయ రణతంత్రం ఆసక్తిగా మారుతోంది. ఆపరేషన్ దక్షిణ కమలంలో భాగంగా క్రమంగా దక్షిణ భారతదేశ రాజకీయాల మీద పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో క్రమక్రమంగా అక్కడి రాజకీయాలు వేడి పుంజుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ కీలక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కమ్యూనిస్టులకు కంచుకోట కేరళ పై భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టినట్లు తెలుస్తోంది. కేరళలో కచ్చితంగా ఈ సారి పాగా వేసేందుకు అవసరమైన సమీకరణాలు వేస్తోంది.
పరుగుల రాణి వస్తారా?
కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ. రాజకీయ చైతన్యం కూడా అధికం. ఇక్కడ గెలుపు సాధారణ విషయం కాదు. ఎంతో విజ్ఞతతో, అలోచించి ఓటేసేవారు కనిపిస్తారు. అందుకే బీజేపీ ఇప్పుడు కొత్త ఫార్ములా ను కేరళలో అనుసరిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారు మేధావివర్గం గా ఉన్నవారు నిజాయితీ పరులుగా దేశానికి సేవ చేసిన వారుగా ఉన్న కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఖచ్చితంగా వారిని పార్టీలోకి తీసుకొచ్చి ఒక కొత్త రూపం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మెట్రోమాన్ శ్రీధర్ న్ ను పార్టీలోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసిన బిజెపి త్వరలో పరుగుల రాణి పి.టి.ఉష ను సైతం బీజేపీ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పి.టి.ఉష సైతం బిజెపి ఆహ్వానాన్ని మన్నించి రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని పి.టి.ఉష గాని ఆమె కుటుంబ సభ్యులు గానీ ధ్రువీకరించడం లేదు.
అందరికీ ఆమోదయోగ్యం అయిన వారిని..
పరుగుల రాణి పి.టి.ఉష గత కొంతకాలంగా బిజెపి కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల పైన కూడా బీజేపీకి ఆమె మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతు చట్టాల పై చేసిన వ్యాఖ్యలను సైతం పి.టి.ఉష ఖండించారు. రైతు చట్టాలు మంచిదే అన్న రీతిలో ట్విట్టర్లో కూడా స్పందించారు. దీంతో ఆమె త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు కేరళ మొత్తం మీద గట్టిగా వార్తలు వచ్చాయి. బిజెపి జాతీయ నాయకులు కేరళలో పర్యటించినప్పుడు ఆమె బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
దేవభూమి ఎప్పుడూ ప్రత్యేకమే
దక్షిణాదిన దేవభూమిగా పిలుచుకునే కేరళలో వామపక్ష పార్టీ Kerala మలబారు మంత్రం.. కాషాయ తంత్రం!! అధికారంలో ఉంది. కేరళలో ఎప్పటినుంచో వామపక్షాలకు మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీద బిజెపి దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. ఇక్కడ కచ్చితంగా పాగా వేసేందుకు సైతం బిజెపి తహతహలాడుతోంది. గతంలో శబరిమల లో మహిళల ప్రవేశానికి అనుకూలంగా బిజెపి ఉద్యమాన్ని ఉధృతం చేసిన అనుకున్న ఫలితం కనిపించలేదు. ఆ ఉద్యమం కూడా పక్కదారి పట్టింది. అయితే ఇప్పుడు పార్టీ మైలేజ్ రావాలంటే కచ్చితంగా అందరూ ఆమోదించే వారిని తీసుకుని, వారి ద్వారా రాజకీయాల్లో ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుందని కేరళలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి భావిస్తోంది.