Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులను అరెస్టు చేస్తూ ఉన్న..సీబీఐ.. తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ అయిన ఇద్దరిలో ఒకరు శరత్ చంద్రారెడ్డి. ఇతను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు అయినా రోహిత్ రెడ్డికి సోదరుడు. అంత మాత్రమే కాదు అరబిందో ఫార్మాకి డైరెక్టర్ కూడా. మరొకరు తెలంగాణకు చెందిన వినయ్ బాబు. ఇద్దరూ భారీ ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయడానికి… ఢిల్లీ లిక్కర్ లాబీలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
దాదాపుగా 2000 కోట్ల వరకు అరబిందో నుంచి ఢిల్లీ లిక్కర్ సిండికేట్ లోకి ప్రవహించినట్లు అధికారులు భావిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి లపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. స్వయంగా విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి శరత్ చంద్రారెడ్డి సోదరుడు కావడంతో… ఈ కేసు నుండి అల్లుడు సోదరుడని తప్పించడానికి విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 21,22, 23 తారీకులలో ఢిల్లీలో అరవింద గ్రూపునకు డైరెక్టర్ గా ఉన్న… శరత్ చంద్రారెడ్డిని ఈడి అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ వెల్లడించింది.
అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ క్రమంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్ లో చేర్చడంతో.. వీడియాధికారులు విచారణలో శరత్ చంద్రారెడ్డి.. గత కొద్ది రోజులు విచారణ చేసి నేడు అరెస్టు చేయడం జరిగింది. విజయ్ సాయి రెడ్డి సొంత అల్లుడు సోదరుడు కావడంతో ప్రతిపక్షాలు ఈ కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.